బెంగళూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వణికిస్తున్న వేళ కర్నాటక మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి కట్టడికి ఊతమిచ్చే చర్యల కోసం తమ ఏడాది వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రుల విరాళాల నిర్ణయాన్ని వెల్లడిస్తూ రెవెన్యూ మంత్రి అశోక పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో కర్నాటకలోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కర్నాటకలో బుధవారం 49,000 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా కేవలం బెంగళూర్ నగరంలోనే 22,000 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది.