హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా.. ఆసరా పెన్షన్లు, సాంప్రదాయేతర ఇంధన వనరులు, కేసీఆర్ కిట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల స్థాపన, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం, హరితహారం కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు.
అనంతరం గంట పాటు జీరో అవర్ నిర్వహించారు. ఆ తర్వాత సభకు టీ విరామం ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభం కాగానే పీఆర్సీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. అనంతరం బడ్జెట్పై చర్చ చేపట్టారు. బడ్జెట్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
నిద్రపట్టట్లేదా.. ఈ పండ్లు తినండి!
ఈ లాభాలు తెలిస్తే.. ఇకపై కారం ఎక్కువగా తింటారు..!
9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల
12 నెలల బకాయిలు చెల్లిస్తాం.. గ్రాట్యుటీ రూ. 16 లక్షలకు పెంపు!