భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం కాగా నిర్ణయాక చివరి మ్యాచ్ ఆదివారం జరుగనుంది. కీలకమైన మూడో వన్డేలో భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రెండో వన్డేలో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా ఇద్దరు స్పిన్నర్ల పేలవ బౌలింగ్తోనే భారత్ ఓటమిపాలైంది. ఫామ్లేమితో సతమతమవుతున్న కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. కెరీర్లో రెండో మ్యాచ్ ఆడిన కృనాల్ పాండ్య కేవలం 6 ఓవర్లలోనే 72 రన్స్ ఇచ్చుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లు కలిపి 16 ఓవర్లు వేసి కనీసం ఒక వికెట్ తీయకుండా 156 పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్ల బౌలింగ్లో చితక్కొట్టిన ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ మరో ఆరు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు.
ఈ నేపథ్యంలోనే లెగ్స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అవకాశం వస్తే సుందర్ బ్యాట్తోనూ రాణించగలడు. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తర్వాతి వన్డేకు కొనసాగనున్నాడు. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్కు విశ్రాంతినిచ్చి యార్కర్ స్పెషలిస్ట్ టీ నటరాజన్ను ఆడిస్తారో చూడాలి. ఐతే బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు జరిగే ఛాన్స్ లేదు. అందరూ తమ స్థానాల్లో అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తున్నారు. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న కోహ్లీసేన వన్డే సిరీస్ను నెగ్గాలని పట్టుదలతో ఉంది.