తిరుమల : తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు వెలుగు చూడటంతో విద్యార్థులకు, బోధనా సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం 75 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ కరోనా పరీక్షలు చేయించింది.
10 మందికి పాటివ్ రావడంతో వీరిని తిరుపతి స్విమ్స్కు తరలించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత వారం వేద పాఠశాలలో 57 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో 21 మంది విద్యార్థులుండగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలింది.