పరిగి, జూన్ 10: కరోనా సమయంలో వేలమందికి సహాయం చేస్తున్న సినీనటుడు సోనూసూద్ను కలిసేందుకు వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాల్పల్లికి చెందిన వెంకటేశ్ కాలినడక ముంబై వెళ్లాడు. ఈ నెల 2న కాలినడక ముంబైకి బయలుదేరగా.. విషయం తెలిసిన సోనూసూద్ బుధవారం అతడికోసం షోలాపూర్వరకు కారు పంపించారు. గురువారం వెంకటేశ్ను ఇంటికి ఆహ్వానించి, మూడు గంట లు గడిపారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని.. జీవనానికి బర్రెలు కొనిస్తానని హామీఇచ్చారు. వెంకటేశ్ కోసం ఫ్లైట్ టికెట్ బుక్చేసి గురువారం రాత్రి విమానంలో హైదరాబాద్ పంపించారు.