నిర్మల్ : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతినిస్తూ.. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో వ్యసాయ మార్కెట్ లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా కష్ట కాలంలో కూడా రైతులకు వానాకాలం సాగుకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు.
ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను సకాలంలో అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్ చైర్ పర్సన్ ముత్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కన్నతల్లి కర్కశత్వం..కూతురు గొంతు కోసిన తల్లి
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం