హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి (69) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన దవాఖానలో చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. ఆయన 1995 నుంచి విశాఖపట్నం మేయర్గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. 2019లో టీడీపీలో చేరారు. ఆయన మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ సీఎం చంద్రబాబు తదితరులు
సంతాపం తెలిపారు.