హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ): పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్నును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి బుధవారం వేర్వేరుగా ఆదేశాలు జారీచేశారు. పట్టణాలు, నగరాలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీలకు ఆస్తు పన్నును మినహాయించారు. కనీస పన్నుగా సంవత్సరానికి రూ.100 చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా వందలమంది పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు ఎంతో మేలు జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పన్ను మినహాయింపుపై సీఎం కేసీఆర్కు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు కృతజ్ఞతలు తెలిపారు.