హైదరాబాద్ : తెలంగాణ పట్ల టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ ఉదార స్వభావం చాటుకున్నాయి. ఈ రెండు సంస్థలు మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ను తెలంగాణకు విరాళంగా ఇచ్చాయి. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. సెకండ్ వేవ్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చినందుకు మీ సహకారం మరువలేనిది అని ప్రభుత్వం పేర్కొన్నది. కరోనా విపత్కర పరిస్థితుల్లో తెలంగాణకు అండగా నిలిచినందుకు అభినందిస్తున్నామని తెలిపింది.