మహబూబ్నగర్, ఏప్రిల్ 7 : త్వరలో ని ర్వహించనున్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యుల ఎన్నికలకు పూర్తి సహకారం అం దించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జడ్చ ర్ల మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని, అభ్యంతరాలు ఉంటే ఈనెల 9వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. 10న పరిష్కారం, 11న తుది ఓటర్ల జాబి తా ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 7 సర్పంచ్, 91 వా ర్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో యా దయ్య, డిప్యూటీ సీఈవో మొగులప్ప, వివిధ పార్టీల నాయకులు సాయిబాబా, లక్ష్మయ్య, రామ్మోహన్, చంద్రకాంత్, ప్రతా ప్ తదితరులు ఉన్నారు.
భూములు ఆక్రమణకు గురికావొద్దు
అదనపు కలెక్టర్ సీతారామారావు
జిల్లాలోని చెరువులు, కుంటల భూము లు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మహబూబ్నగర్, జడ్చర్ల మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చే చెరువులు, కుంటలు, శిఖం భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భూములకు సంబంధించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఆర్వో స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, సర్వేల్యాండ్ రికార్డుల జిల్లా అధికారి శ్యాంసుందర్రెడ్డి తదితరులు ఉన్నారు.