ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టాడో తెలియదు కాని కరోనా వలన ఈ చిత్రం నెలల తరబడి వాయిదా పడుతూ వస్తుంది. మే 13న మూవీ విడుదల చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించగా, కరోనా సెకండ్ వేవ్తో మళ్లీ వాయిదా పడింది. అయితే 90 శాతం పూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య రెండు వారాలలో మిగతా పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనుందట.
ఆచార్య చిత్ర షూటింగ్ పూర్తైన తర్వాత చిరంజీవి మిగతా సినిమాలు చేయడానికి లాంగ్ గ్యాప్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది.ఆచార్య చిత్రం తర్వాతా చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్లు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ సినిమాలు చేసేందుకు మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారట చిరు. వచ్చే ఏడాది రెండు సినిమాలను మొదలు పెట్టనున్నట్టు సమాచారం