వందశాతం వ్యాక్సినేషన్తో రికార్డు
40 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా
తొలుత టీకా వేసుకుని అపోహలు తొలగించిన సర్పంచ్
ఇంటింటికీ వెళ్లి 314 మంది అర్హులున్నట్లు గుర్తింపు
పీహెచ్సీకి వెళ్లిరావడానికి ప్రత్యేక వాహనాల ఏర్పాటు
సర్పంచ్ చొరవతో వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్
వరంగల్రూరల్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో మరియపురం గ్రామం ఎప్పుడూ ముందుంటుంది. కరోనా కట్టడిలో ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ 40 ఏండ్లకు పైబడిన అర్హత గల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో తొలివిడుత వందశాతం కరోనా వ్యాక్సినేషన్ జరిగిన గ్రామంగా రికార్డు సృష్టించింది. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అర్హత గల ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత 60ఏండ్లు పైబడిన వారికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, ఈ నెల ఒకటి నుంచి 40 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తమ గ్రామంలో అర్హత గల వారంద రూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత 60ఏండ్లు పైబడిన వారు, అనంతరం 40 ఏం డ్లు పైబడిన వారు మొత్తం 314మంది అర్హులు ఉన్న ట్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
టీకా పై అపోహలున్నందున మొదట సర్పంచ్ బాలిరెడ్డి గీసుగొండ మండల కేంద్రంలోని పీహెచ్సీలో గత మార్చి 6న తొలిడోస్ టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ‘మన ఊరు మరియపురం’ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపు ద్వారా గ్రామస్తులకు తెలియజేశారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని లేదని, వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. విస్తృత ప్రచారంతో ప్రజలను చైతన్యపరిచారు. తొలుత గ్రామంలోని 60 ఏండ్లుపైబడిన గీసుగొండ పీహెచ్సీకి వెళ్లి వచ్చేందుకు మార్చి 24, 25 తేదీల్లో బస్సు, మినీ వ్యాన్ సమకూర్చారు. మొదటిరోజు 60, రెండో రోజు 60 మందికి వ్యాక్సిన్ తొలిడోస్ వేయించారు. మరి కొందరు స్వ చ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
రెండో విడుత 174 మందికి
ఈ నెల ఒకటి నుంచి 40ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలైంది. గ్రామంలో 174మంది ఉన్నట్లు గుర్తించిన సర్పంచ్ గీసుగొండ పీహెచ్సీలో వ్యాక్సిన్ వేసుకునేలా మరో ప్లాన్ చేశారు. అందరితో మాట్లాడి 4, 5తేదీల్లో బస్సు, మినీవ్యాన్ ఏర్పాటు చేశారు. తొలిరోజు 60 మంది, రెండోరోజు 60 మందికి వ్యాక్సిన్ వేయించారు. మరో 54మంది ఈ నెల 15వ తేదీన వ్యాక్సిన్ వేసుకున్నట్లు వైద్యు లు తెలిపారు. వీరితో కలిపి మరియపురం లో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 314కి చేరింది. ఇక్కడ 40ఏండ్లుపైబడిన వారందరూ టీకా వేసుకోవడం విశేషం. నూరుశాతం తొలివిడత వ్యాక్సినేషన్ జరిగిన గ్రా మంగా మరియపురం అధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నది. మరియపురం గ్రామస్తులను ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల్లోని 40ఏండ్లుపైబడిన వారు కూ డా వ్యాక్సిన్ వేసుకునేందుకు స్వచ్ఛందం గా ముందుకొస్తున్నారు.