నిర్మల్ : విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం డివిజన్లో పనిచేస్తున్న ఇద్దరు రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారిని నిర్మల్ ఎఫ్డీపీటీ వినోద్కుమార్ సస్పెన్షన్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్డీవో మాధవరావు తెలిపారు. ఇటీవల పైడిపల్లి బీట్లో కలప స్మగ్లర్లు అడవులను నరికి విలువైన దుంగలను తీసుకెళ్లగా.. జన్నారం రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్, చింతగూడ సెక్షన్ అధికారి సహేద పర్వీన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై సస్పెన్షన్ చేసినట్లు ఆయన తెలిపారు.
అలాగే నిర్మల్ డివిజన్లో దిమ్మదుర్తి బీట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అంటీపోచ్ రేంజ్ అధికారి కల్పనాదేవిని కూడా సస్పెన్షన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని
కొవిడ్ దవాఖానను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి