వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు, వడగండ్లతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పట్టణంలో కొన్ని చోట్ల చెట్లు నేలకూలాయి. చెట్టు విరిగి కరెంట్ వైర్లపై పడడంతో స్తంభాలు నేలకొరిగాయి.
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి జిల్లా కలెక్టర్ పౌసమిబసుతో ఫోన్లో మాట్లాడారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది అలర్ట్గా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ సిబ్బంది, అధికారులు నిత్యం ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని ఎంపీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం