అందోల్/సంగారెడ్డి : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న పథకాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ యాక్షన్ ప్లాన్ లో లబ్ధి చేకూరే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.
గ్రామీణ ప్రాంత యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు రావు, అందోల్, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్, వట్ పల్లి మండలాలకు చెందిన ఎంపీడీవోలు, అందోల్- జోగిపేట మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత