హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ పార్టీ బుధవారం ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, పార్టీ నేతలపై ఈటల అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ ఓటుకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు పంచేందుకు సిద్ధంగా ఉందని ఈటల ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, సోమ భరత్కుమార్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల వ్యవస్థనే ఈటల అపహాస్యం చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో సాక్షాధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించారు.