హైదరాబాద్ : ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో టీ సాట్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో శైలేష్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం జులై 17(శనివారం)వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు శైలేష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక లైవ్లో మంత్రి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆయిల్ పామ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ వెంకట్ రాంరెడ్డి, పలువురు శాస్ర్తవేత్తలు పాల్గొననున్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగపరుచు కావాలని శైలేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.