ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం టీ-శాట్ నెట్వర్క్ చానళ్ల ద్వారా సోమవారం నుంచి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్(వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్స్ సెమికండక్టర్లపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్టు రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఇంజినీరిం గ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ఐటీశాఖ ఆధ్వర్యంలో టాస్క్, పోటానిక్స్ వాలి కార్పొరేషన్(పీవీసీ), వేదా ఐఐటీ సంయుక్తంగా వీఎల్ఎస్ఐపై శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
15 రోజులపాటు శిక్షణ
సోమవారం నుంచి 15 రోజులపాటు ఉదయం 8.15 నుంచి 10.30గంటల వరకు నిపుణ చానల్లో ఈ శిక్షణ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని టీ-శాట్ సీఈవో శైలేశ్రెడ్డి తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు పున:ప్రసారం అవుతుందని చెప్పారు. టీ-శాట్ ఫేస్బుక్, యూట్యూబ్లోనూ లైవ్ ప్రసారాలు అం దుబాటులో ఉంటాయని వివరించారు.