సంగారెడ్డి : బోనాలు తెలంగాణ సంస్కృతిక ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు నియోజకవర్గంలో బోనాల పండుగ సందర్భంగా పలు ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగ తెలంగాణలో ప్రత్యేక పండుగ అని అన్నారు. ఇందుకోసం ఆలయాలను దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిద్ధం చేశామన్నారు. ఉత్సవాల్లో పాల్గొనే ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక విజయ్కుమార్, జడ్పీటీసీ సుప్రజ, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత