కరీంనగర్ : హుజురాబాద్ చైతన్యానికి ప్రతీక అని సంక్షేమ శాఖ మంత్రి మంత్రి కొప్పుల అన్నారు. ఆదివారం చల్లూరు గ్రామం వెంకటేశ్వర గార్డెన్ లో జరిగిన వీణవంక మండల స్థాయి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరైన మాట్లాడారు. హుజరాబాద్ నియోజకవర్గం గతంలో నుంచి రాజకీయాల్లో చైతన్యం కలిగినటువంటి నాయకులు, ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలోని అందరికి తెలిసిన విషయమేనన్నారు.
ఈటల రాజేందర్కు పార్టీలో సీఎం కేసీఆర్ అందరి కన్నా ఎక్కువగా గుర్తింపునిచ్చారు. సముచిత స్థానం కల్పించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈటల ఐదు సంవత్సరాలు పార్టీకి చాలా దూరంగా ఉన్నా అని చెప్పినా మిమ్మల్ని పార్టీ గౌరవిస్తూనే ఉందన్నారు. పార్టీ పరంగా మీకు జరిగిన నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటల ఐదేండ్లుగా ప్రభుత్వం, ప్రభుత్వ పథకాల మీద ఆరోపణలు చేసినా సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని
కొవిడ్ దవాఖానను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి