హైదరాబాద్: రెండేండ్ల క్రితం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ టేకోవర్ చేసిన స్వరాజ్ సంస్థ తెలంగాణలో కొత్త హార్వెస్టర్ను (పంట కోత మిషన్) విడుదల చేసింది. స్వరాజ్ ప్రో కంబైన్ 7060 పేరుతో తీసుకొచ్చిన ఈ మిషన్ ఒక ట్రాక్ చేయబడిన హార్వెస్టర్. తెలంగాణ వరి రైతులకు ఇది మెరుగైన ఉత్పాదకతను అందించనుంది. దీని పనితీరు కూడా బాగుంటుంది. ఈ హార్వెస్టర్ను ఆపరేట్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా వృథా తగ్గి ధాన్యం దిగుబడి పెరుగడానికి తోడ్పడుతుంది.
ఈ నూతన హార్వెస్టర్కు ఒక కొత్త వరి కట్టర్ బార్ను అమర్చినట్లు స్వరాజ్ తెలిపింది. ఇది నేలపై వాలిపోయిన పంటను కూడా సమర్థంగా కట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నది. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువే. వరి, సోయాబీన్ కోతకు బాగా ఉపయోగపడేలా ఈ హార్వెస్టర్ను అభివృద్ధి చేశారు. ధాన్యాన్ని కోయడం, నూర్పిడి చేయడం, ధాన్యం గింజల నష్టం ఎక్కువగా జరుగకుండా, విరిగిపోకుండా పనిచేయడం ఈ హార్వెస్టర్ ప్రత్యేకత.
ఈ హార్వెస్టర్ గురించి స్వరాజ్ సీఈవో హరీష్ చవాన్ మాట్లాడుతూ.. ఈ మిషన్తో వరి కోయడానికి చాలా సులభమైన ప్రాసెస్ ఉంటుందని చెప్పారు. వ్యవసాయ విస్తరణ పెరుగుతున్న కొద్దీ సాంకేతికత విస్తృతమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రైతుల కోసం స్వరాజ్ ప్రో కంబైన్ 7060 హార్వెస్టర్ను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఈ హార్వెస్టర్ను కొనుగోలు చేసిన రైతులకు సర్వీస్, స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
స్వరాజ్ ప్రో కంబైన్ 7060 హార్వెస్టర్ తెలంగాణవ్యాప్తంగాగల స్వరాజ్ రిటైల్ అండ్ సర్వీస్ నెట్వర్కుల ద్వారా విక్రయించబడుతుందని, రాష్ట్రమంతటా సర్వీస్ సెంటర్లు కూడా ఉన్నాయని చెప్పారు.