వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం వేములకొండపై బుధవారం నిత్య సహాస్ర నామార్చన, నిత్య హోమం, నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వ
హించారు. ఎంపీపీ నూతి రమేశ్రాజ్ జన్మదినం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు నిత్యా న్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో రవికుమార్, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.