మాహబూబాబాద్ : స్వచ్ఛ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం కేసముద్రం మండలంలో పిచ్చి చెట్లను తొలగించారు. వాటర్ ట్యాంక్ పరిసరాలలో క్లోరినేషన్ చేశారు. అదేవిధంగా పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ ప్రజలకు వర్షకాల ఆరంభంలో అంటూ రోగాలు రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి రోజు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
మాహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రతి రోజు పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలు నిర్వహిస్తున్నామన్నారు.కార్యక్రమంలో మార్కెఫెడ్ డైరెక్టర్ మర్రి రంగా రావు, ఏఎంసీ చైర్మన్ నారాయణ రావు, ఎంపీపీ వొలం చంద్ర మోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం