సూర్యాపేట : సూర్యాపేట కవులు, రచయితలకు పెట్టింది పేరని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ‘అభ్యుదయ కవులపై తెలంగాణా విమోచనోద్యమ ప్రభావం’ అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పాతికేళ్ల కిందట రచయిత పంతంగి వెంకటేశ్వర్లు చేసిన పరిశోధన ఇప్పుడు పుస్తక రూపం దాల్చడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి పంతగి తెలంగాణ విమోచన ఉద్యమం అని పేరు పెట్టిండు. సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించిన చరిత్ర సూర్యాపేటకు ఉందన్నారు. మంచి ఆడియన్స్ కల్చర్ ఉన్న జిల్లా సూర్యాపేట అని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సూర్యాపేటకు ఉద్యమాలకు విడదీయని బంధం ఉందన్నారు. కవులు సృష్టించిన అక్షరాలు సైతం ఉద్యమాలకు ఊపిరి పోస్తాయని పేర్కొన్నారు. కవితలు, పాటలు, గ్రంథాల రూపంలో కవులు, రచయితలు ఎవరి ప్రతిభ వారిదే..
రాష్ట్ర సాధన సమయంలో వచ్చిన పాటలు ఎప్పటికి మరిచిపోలేమన్నారు. భారతదేశం అభివృద్ధిలో ఇన్ని రకాల మార్పులు వచ్చాయంటే దానికి సాయుధ పోరాటమే ప్రధాన కారణమన్నారు.
కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పుస్తక రచయిత పంతంగి వెంకటేశ్వర్లు, గుణగంటి వెంకటేశం, భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కంగనా పరువాల విందు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
సిద్ధాపూర్లో గంజాయి మొక్కలు ధ్వంసం
థియేటర్స్లోకి రాబోతున్న మరో రెండు సినిమాలు