సూర్యాపేట టౌన్: వందల ఏండ్లు విదేశీయులు భారత దేశాన్ని పాలించినప్పటికీ చెక్కుచెదరని సంస్కృతి మనది.. రాష్ట్రం లో సీఎం కేసీఆర్ నాయక త్వంలో కేవలం ఏడేళ్లలోనే అన్ని రంగాల అభివృధ్ధితో పాటు ఐక్యతను పెంపొందించుకున్నం.. ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ అన్ని మతాల ను గౌరవించుకుంటూ ఐక్యంగా ఉండటంలోనూ మనకు మనమే సాటి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
గణేశ్ నిమజ్జనం సంర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో శ్రీవేదాంత భజన మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహా నికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ శోభాయాత్రను ప్రారంభించి మాట్లాడారు. బ్రిటీష్ వారు పాలించిన చాలా దేశాల్లో, ప్రాంతాల్లో అక్కడి వారి సంప్రదాయాలు ఎక్కువ శాతం కనుమ రుగయ్యాయని.. అటువంటి పరిస్థితిల్లో వందల ఏండ్లు మన దేశాన్ని ఆంగ్లేయులు పాలించినప్పటికీ మన సంస్కృతి చెక్కు చేదరలేదన్నారు.
అంతేకాకుండా మన దేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు వారు జీవిస్తున్నారని.. వారి వారి మతాలను, సంప్రదాయాలను గౌరవించుకుంటూ మరింత ఐక్యతను పెంచుకుంటున్నామన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేండ్లుగా అన్ని మతాల వారి ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రత్యేక విందులు, పండుగ సామగ్రిని అందిస్తూ అందరి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నారన్నారు.
అంతే కాకుండా 2014కు ముందు పండుగలంటే ఎలా జరుపుకునేవారమో.. ఎలాంటి వాతావరణం ఉండేదో ఇక్కడి ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలన్నీ ప్రశాంత వాతావ రణంలో కులమతాలకతీతంగా ఐక్యతతో మరింత సంబురం గా జరుపుకుంటున్నారన్నారు.
గత ఏడాది కరోనా మహమ్మా రి వలన గణపతి నవరాత్రులు ఇంటికే పరిమితమై వీధుల్లో సంబురాలు జరుపుకోలేక పోయామని.. ఈ ఏడాది సైతం జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది నాటికి కరోనా మహ మ్మారి పూర్తిగా అంతమై వేడుకల కు మరింత సంబురంగా జరుపుకుందామన్నారు.
అంతే కాకుండా వచ్చే ఏడాది నాటికి రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేసుకుని సూర్యాపేటను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకుంటూ విశాలంగా మారిన వీదుల వెంట గణేశ్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా జరుపుకుందామన్నారు. అనం తరం శోభా యాత్రలో ముందుగా ఉన్న శ్రీవేదాంత భజన మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహాం కొలువు దీరిన వాహనాన్ని మంత్రి స్వయంగా నడిపి సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతానికి శోభాయాత్రగా తీసుకెళ్లారు.
అంతేకాకుండా అక్కడ నిమజ్జనానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో విగ్ర హాంతో పాటు నీటిలోకి వెళ్లి మంత్రి స్వహస్తాలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూల సెంటర్ మీదుగా ప్రారంభమైన శోభాయాత్ర పోస్టాఫీస్, పోలీస్ స్టేషన్, పాతబస్టాండ్, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా (కోర్టు చౌరస్తా), శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, రైతు బజార్ మీదుగా సద్దుల చెరువు మినీట్యాంక్ బండ్ వరకు కొనసాగింది.
ఈ సందర్బంగా మంత్రి గణపతి కొలు వుదీరిన మొదటివాహనాన్ని నడుపుతూ శోభాయాత్ర నిర్వహిస్తున్న సమయంలో వీధుల వెంట భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున ఆయనను పలకరిస్తూ పొటోలు, సెల్ఫీలు దిగుతూ జై భోలో గణేశ్ మహరాజ్కీ జై అంటూ సందడి చేశారు.
ఈ వేడుకలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితాఆనంద్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, మొరిశెట్టి శ్రీనివాస్, గుడి పూడి వెంకటేశ్వరరావు, తాహెర్ పాషా, శనగాని రాంబాబు గౌడ్, కొండపల్లి దిలీప్ రెడ్డి, ఆకుల లవకుశ, వెంపటి సురేశ్, ఉత్సవ కమిటీ సభ్యులు అనంతుల కృపాకర్, రంగరాజు రుక్మారావు, చల్లమళ్ల నర్సింహా, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.