వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ప్రకటించారు. 23 మందితో కూడిన బృందాన్ని సోమవారం ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తమ స్టార్ ఆటగాళ్లను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. సిరీస్కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. ఇటీవల న్యూజిలాండ్తో టూర్కు దూరమైన స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ మళ్లీ జట్టులోకి వచ్చారు.
అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు జూలైలో విండీస్ టూర్కు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్తో ఆస్ట్రేలియా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్నకు విదేశీ జట్లు సన్నద్ధమవుతున్నాయి.