సూర్యాపేట, జూలై 4 : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. ఓహెచ్ఎస్ఆర్, మినీ వాటర్ ట్యాంకులు, పశువుల తొట్లను శుభ్రం చేశారు. పాత బావులను పూడ్చి అపరిశుభ్ర ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. క్లోరినేషన్, ఫాగింగ్, శ్రమదానం చేశారు. సూర్యాపేట పట్టణంలోని 2, 8, 10, 20, 22, 26, 30, 34, 41, 48వ వార్డుల్లో జరిగిన పట్టణ ప్రగతిలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ పాల్గొని మొక్కలు నాటారు. 22వ వార్డులో వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, కౌన్సిలర్లు గౌరయ్య, సోమలక్ష్మి, రాజేశ్, విక్రం, షఫీ పాల్గొన్నారు. సూర్యాపేట మండలం బాలెంల, రామన్నగూడెం, ఆరెగూడెం, దాస్తండాలో ఆర్డీఓ రాజేంద్రకుమార్ పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడీ భిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్నాయుడు, సర్పంచులు పాల్గొన్నారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి, గాయంవారిగూడెం, చందుపట్లలో వాటర్ ట్యాంకుల క్లోరినేషన్, పైపులైన్ల లీకేజీ మరమ్మతులు, శానిటేషన్ పనులు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.జమలారెడ్డి, సర్పంచ్ కంచర్ల నిర్మల, పంచాయతీ కార్యదర్శి కోటిరెడ్డి పాల్గొన్నారు. పెన్పహాడ్ మండలం మాచారం, దుబ్బతండా, మేగ్యాతండా, ధర్మపురం, రంగయ్యగూడెం, భక్తళాపురం, మోర్చకుంటతండా గ్రామ పంచాయతీల్లో మండల ప్రత్యేకాధికారి రాంపతినాయక్, ఎంపీడీఓ వెంకటాచారి, ఎంపీఓ ఆంజనేయులు పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో..
తిరుమలగిరి : మండలంలోని ఆయా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో కంప చెట్లు, వీధుల్లో పిచ్చి మొక్కలను తొలగించి మురుగు కాల్వలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమేశ్, ఎంపీఓ మారమ్మ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండలంలోని కేశవాపురం గ్రామంలో వీధులను శుభ్రం చేసి మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మంచినీటి ట్యాంకులను క్లీన్ చేశారు.
నాగారం : మండలంలోని ఫణిగిరి గ్రామంలో జేసీబీ సహాయంతో రోడ్ల వెంట పెంట దిబ్బలను తొలగించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ముక్కంటి, ఎంపీటీసీ జంపాల శోభారాణి, ఉప సర్పంచ్ నరేశ్, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మద్దిరాల మండల కేంద్రంలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. చందుపట్లలో డ్రైనేజీలను శుభ్రం చేశారు. పోలుమళ్లలో డోజర్తో రోడ్డు వెంట క్లీన్ చేశారు. మామిండ్లమడవ, చిననెమిల గ్రామాల్లో మురుగు కాల్వల శుభ్రం, రోడ్డు వెంట పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారు. రెడ్డిగూడెం, ముకుందాపురం గ్రామాల్లో వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు. గోరెంట్లలో డ్రైనేజీ పూడిక తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇండ్లల్లో మొక్కలు నాటారు. చవుళ్లతండాలో రోడ్డు వెంట పిచ్చి మొక్కలు తొలగించారు. తూర్పుతండాలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.