తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ జంటగా ‘మెర్రీ క్రిస్మస్’ పేరుతో హిందీలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. రమేష్ తౌరాని నిర్మాత. మే నెలలో సెట్స్మీదకు తీసుకెళ్లాల్సిన ఈ సినిమాను కరోనా ప్రభావంతో వాయిదా వేశారు. జూన్ ద్వితీయార్థంలో ఈ సినిమాను మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ప్రస్తుతం కరోనా ఉధృతి దృష్ట్యా తలెత్తుతున్న షూటింగ్పరమైన ఇబ్బందులు, తక్కువ టీమ్తో పనిచేసే నిబంధనల వల్ల సినిమా నిడివిని తొంభైనిమిషాలకు కుదించనున్నట్లు చెప్పారు. ‘రెండున్నర గంటల నిడివితో భారీ స్థాయిలో సినిమాకు ప్లాన్ చేశాం. అయితే భవిష్యత్తులో తలెత్తబోయే పరిస్థితుల్ని ఊహించలేం కాబట్టి త్వరగా చిత్రీకరణ పూర్తి చేసే ఉద్దేశంతో నిడివి తగ్గించాం. ఎలాంటి విరామం లేకుండా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు.