కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27 నుంచి దళితబంధు ఇంటింటి సర్వే ప్రారంభించనున్నట్టు సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్బొజ్జా తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో కరీంనగర్, వరంగల్ అర్బన్ కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, రాజీవ్ హన్మంతుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతి రైతుకు రైతుబంధు ఏవిధంగా వర్తిస్తుందో.. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అలాగే వర్తిస్తుందని స్పష్టంచేశారు. పథకం అమలులో ఎలాంటి నిబంధనలు ఉండబోవని, ప్రతిఒక్కరి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేస్తామని చెప్పారు. ఇందుకోసం కరీంనగర్ కలెక్టర్ ఖా తాలో ఇప్పటికే 1,500 కోట్లు జమచేశామని, మూడు రోజుల్లో మరో 500 కోట్లు జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రం లో మొదటిసారి దళితబంధు పథకం కోసం హుజూరాబాద్ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, ఇక్కడి అనుభవాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తా మని చెప్పారు. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారులను ఈ సర్వేకు నియమించామని వివరించారు.