శేఖర్ కమ్ముల సినిమాలలో ఎంత ఫీల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి అభిరుచి గల దర్శకులలో ఆయన కూడా ఒకరు. ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉన్న శేఖర్ కమ్ముల ఏప్రిల్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అని టాలీవుడ్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
నారప్ప, ఎఫ్ 2, దృశ్యం 2 చిత్రాలతో బిజీగా ఉన్న వెంకటేష్తో శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఇటీవల శేఖర్ కమ్ముల చెప్పిన కథకు వెంకటేష్ ఇంప్రెస్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. లవ్ స్టోరీ సినిమా పూర్తైన తర్వాత శేఖర్ కమ్ముల .. వెంకీ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నాడు. ఇక వెంకీ నటిస్తున్న ‘నారప్ప’ మే 14న, ‘దృశ్యం 2’ జూలైలో, ‘ఎఫ్ 3’ ఆగస్టు 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.