బెంగళూరు: ఒక ప్రొఫెసర్ను మోసం చేసిన కేసులో రామ్సేన కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అత్తవర్ను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ను ఆయన మోసం చేశారు. రాయచూర్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. ఈ పోస్ట్ కోసం అత్తవర్ ఆ ప్రొఫెసర్ను రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. అడ్వాన్స్గా రూ.17.5 లక్షలు తీసుకున్నారు. అయితే తనకు వీసీ పోస్ట్ రావకపోవడంతో ఆ ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చీటింగ్ కేసు నమోదు చేసిన మంగళూరు పోలీసులు ప్రసాద్ అత్తవర్ను సోమవారం అరెస్ట్ చేశారు.