న్యూఢిల్లీ : ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై), సమగ్ర ప్రజా పంపిణీ వ్యవస్ధ (ఐఎంపీడీఎస్) పథకాల కింద లబ్ధిదారులకు ప్రయోజనాలను నిరాకరిస్తున్నారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) గురువారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
కొవిడ్-19 మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి కాలేదనే పేరుతో లబ్థిదారులకు ఈ ప్రయోజనాలను నిలిపివేస్తుండటం పట్ల ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది.