హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలను రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ సాంస్కృతిక శాఖ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సురభి నాటకోత్సవాలను సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివ కుమార్తో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెలసీ, ప్రముఖ వాగ్గేయకారులు గోరేటి వెంకన్న, భాగన్న గౌడ్, సురభి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.