న్యూఢిల్లీ : హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. రేపు విచారణకు తీసుకోవాలని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.