బెర్లిన్: జర్మనీలో మళ్లీ లాక్డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈస్టర్ సెలవు దినాల్లో దాదాపు అయిదు రోజుల పాటు ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. మూడవ వేవ్ కరోనా ఉదృతిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో యూకే కోవిడ్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొత్త వైరస్ ప్రబలుతోందని, అది చాలా ప్రమాదకరమైందని, ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నట్లు మెర్కల్ తెలిపారు.