సూర్యాపేట : కోవాక్సిన్, కొషీల్డ్ టీకాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడంతో పాటు టీకాలు పంపాలని ఆయన సూచించారు. సూర్యాపేట ఏరియా దవాఖనలో బుధవారం ఆయన కరోనా టీకా రెండో డోస్ ను తీసుకున్నారు.
అనంతరం కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు దవాఖానలో అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు.
అలాగే ఉమ్మ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పరిస్థితులపై డీఎంహెచ్వోలతో మంత్రి ఫోన్ లో సమీక్షించారు.
అలాగే హెటిరో డ్రగ్స్ ఎండీతో ఫోన్ లో సంప్రదించి తగినంత రెమిడిసివర్ ను వెంటనే పంపించాలని ఆదేశించారు. దవాఖానలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ను స్వయంగా ఆయన పరిశీలించారు.
కొవిడ్ పేషంట్ల తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. పాజిటివ్ అని తెలంగానే పరేశాన్ కావొద్దని సూచించారు. భయాందోళననే మనిషిని ఆగం చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.
మానసిక ధైర్యమే కరోనా పై విజయానికి మందు లాగా పనిచేస్తుందన్నారు. బాధితులతో మాట్లాడి వారిలో భరోసా కల్పించారు.
ఇవి కూడా చదవండి..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు