మన్సూరాబాద్, మే 21: బిగ్బజార్ నుంచి సుష్మ చౌరస్తా వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సముచిత నిర్ణయం తీసుకుంటానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి బిగ్బజార్ నుంచి సహారా చౌరస్తా వరకు శుక్రవారం కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ అంశంపై వారితో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిగ్బజార్ నుంచి సుష్మ చౌరస్తా వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ వల్ల నష్టపోతున్న వాణిజ్య సముదాయాల బిల్డింగ్ యజమానుల విన్నపం మేరకు పర్యటించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ 100 ఫీట్ల మేర కాకుండా 80కి కుదించాలని పలువురు విన్నవించారని తెలిపారు. వాణిజ్య భవనాల యజమానుల అభిప్రాయాలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరింపజేసే మార్గాలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్యాదవ్, వివిధ కాలనీ ప్రతినిధులు జేజే రెడ్డి, చీర్క నర్సిరెడ్డి, మోహన్రెడ్డి, ఆంజనేయులుగౌడ్, నర్సింహారెడ్డి, రాజేశ్, నర్సింహ, నాయకులు విజయభాస్కర్రెడ్డి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.