చాలా మంది హీరోలు గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి ఒకరిద్దరు మాత్రమే చదువు అబ్బక ఇండస్ట్రీకి త్వరగా వచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందరి కంటే డిఫెరెంట్. ఈయన చాలా త్వరగా సినిమాల్లోకి వచ్చేసాడు. పట్టుమని 18 ఏళ్లు కూడా నిండకముందే.. ఓటు హక్కు కూడా రాకముందే ఇండస్ట్రీకి వచ్చేసాడు. నిన్ను చూడాలని సినిమాతో రామోజీరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ పరిచయం అయ్యాడు. నిన్ను చూడాలని సినిమా ఫ్లాప్ అయినా కూడా అచ్చంగా తాత మాదిరే ఉన్నాడుగా అంటూ అంతా నందమూరి వారసుడిని పొగిడేసారు.
ఆ తర్వాత స్టూడెంట్ నెం 1 సినిమాతో హిట్ కొట్టి నిలబడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. మూతిమీద మీసాలు కూడా లేని టైమ్లోనే ఆది, సింహాద్రి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులతో ఆడుకున్నాడు ఈ హీరో. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం జూనియర్ టాప్ హీరో. నందమూరి వంశంలో బాలయ్య తర్వాత ఆ స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్.
ఇదిలా ఉంటే జూనియర్ కెరీర్ ఆరంభంలోని కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈయన తీసుకున్న తొలి రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 1997లో బాల రామాయణం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు జూనియర్. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు.
ఈ చిత్రానికి అవార్డులతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం అప్పట్లో 4 లక్షలు తీసుకున్నాడు ఎన్టీఆర్. కేవలం 17 ఏళ్ల వయసులో ఈయనకు వచ్చిన రెమ్యునరేషన్ తీసుకుని సీదా ఇంటికి వెళ్లిపోయాడు జూనియర్. 4 లక్షలతో ఏం చేసుకోవాలో కూడా తెలియక అమ్మ శాలినికి ఇచ్చేసాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఏదేమైనా జూనియర్ జర్నీ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమే.
ఇవి కూడా చదవండి..
అనుష్క-నవీన్ పొలిశెట్టి మూవీ స్టోరీ లైన్ ఇదే..!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం ?
సల్మాన్ ఖాన్ మేనకోడలు బాలీవుడ్ ఎంట్రీ..!
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతా పాజిటివ్..ఎందుకిలా!
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం?