ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాల్లోని డ్రైవర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. లారీలు ఢీకొన్న వేగానికి క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్లలో ఇరుక్కుపోయిన డ్రైవర్ల మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.