మహబూబ్ నగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రినే ఓ వ్యక్తి బంధువుతో కలిసి దారుణంగా హతమార్చాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కావేరమ్మపేట్కు చెందిన మౌలానా (54)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య తన నలుగురు పిల్లలతో కలసి 20 ఏండ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లింది. కావేరమ్మపేట్లో మౌలానా రెండో భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల మొదటి భార్య కుమారులు జడ్చర్లలో ఓ హోటల్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మొదటి భార్య కుమారులు ఇంట్లో ఉండేందుకు వెళ్తే తండ్రి రానియలేదు. దీంతో తండ్రి, కుమారుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవల నేపథ్యంలో మొదటి భార్య కుమారుడు ఇబ్రహీం, మృతుడి మేనల్లుడుతో కలిసి మౌలానాను హత్య చేశారని సీఐ తెలిపారు. నిందితులిద్దరూ పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.