హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో.. వేసవి సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. డైట్ కాలేజీలకు కూడా 15 వరకు సెలవులు పొడిగించారు. తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ పొడిగింపుతో వేసవి సెలవులను పొడిగించారు.