పూంచ్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని భారత సైన్యం క్షేమంగా పాకిస్థాన్కు అప్పగించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన గులామ్ క్వాదిర్ అనే వ్యక్తి గత ఆదివారం భారత భూభాగంలోకి వచ్చాడు. దీంతో అతన్ని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే మానవీయ కోణంలో అతన్ని పాక్ అధికారులకు అప్పగించామని ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గులామ్ క్వాదిర్ పీఓకేలోని నికియల్ ఘిమ్ గ్రామానికి చెందినవాడని, అతడు ఈనెల 11న భారత భూభాగంలోకి ప్రవేశించాడని తెలిపారు. అయితే అతనికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత.. పొరబాటున సరిహద్దు దాటాడని, దీంతో నిన్న పాకిస్థాన్ అధికారులకు అప్పగించామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..