నిర్మల్ టౌన్, ఏప్రిల్ 1: జిల్లాలో కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కొవిడ్ వైరస్ నివారణ చర్యలపై సమీక్షించారు. ప్రభు త్వం వ్యాధి నిరోధానికి ఉచితంగా అందిస్తున్న టీకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై వైద్యశాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. జిల్లా కేం ద్రంతోపాటు పీహెచ్సీల్లో కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా మాస్క్, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మాతాశిశు సంరక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. వివిధశాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి ప్రగతి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, జిల్లా వైద్యశాఖ అధికారి ధన్రాజ్, ఆసుపత్రి వైద్యులు దేవేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పెంబి మండలంలోని గిరిజన తండాకు చెందిన సర్పంచులు తమ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గురువారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి వినతిపత్రం అందించారు.
ప్రైవేటు వాహనాల నియంత్రణకు చర్యలు
నిర్మల్ జిల్లాలో ప్రైవేటు వాహనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ప్రైవేటు వాహనాల వల్ల ఆర్టీసీకి ఆదాయం రాకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వెంటనే ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా ప్రజలు పాటించాలన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేటు వాహనాల వల్ల ఆర్టీసీ ఆదాయం రోజురోజుకూ పడిపోతున్నదని దీనికోసం ప్రైవేటు ఆటోలను నియంత్రించాలని ఆర్టీసీ ఆర్ఎం కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో డీఎం విజయ్భాస్కర్రెడ్డి, డివిజనల్ మేనేజర్ రమేశ్, డిప్యూటీ ఈఈ పీ ఆర్ సింగ్, సత్లాల్, నిర్మల్, భైంసా డిపో మేనేజరు ఆంజనేయులు, రవీందర్, సహాయ మేనేజర్లు అమృత, విశ్వనాథ్ పాల్గొన్నారు.
మీర్జాపూర్ ఘటనపై సమీక్ష
ఇటీవల భైంసా మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో బాలికపై లైంగిక వేధింపుల ఘటనపై తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ బాలికలను అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయడంలో పోలీసు జాప్యంపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.