లెబనాన్ : ఓ ఆరేండ్ల చిన్నారి నకనకలాడే ఆకలితో ఉండి.. ఆతృతతో తింటూ ఊపిరాడక మరణించింది. ఈ హృదయ విదారక ఘటన సిరియా శరణార్థి శిబిరంలో జరిగింది. అక్కడి చిన్నారుల బాల్యం పూర్తిగా గొలుసుల్లో బంధీగా మారింది. అమ్మ ఒడిలో హాయిగా బువ్వ తిని పడుకోవాల్సిన చిన్నారులు.. ఆతృతతో తింటూ కడుపునింపుకుంటున్నారు.
గొలుసులతో కనిపిస్తున్న ఈ ఆరేండ్ల అమ్మాయి పేరు నహ్లా అల్ ఒత్మాన్, పోషకాహార లోపంతో బాధపడుతోంది. తినేప్పుడు చాలా తరచుగా గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అలాగే జరిగింది అని చూసేలోపు తుదిశ్వాస వదిలింది. యుద్ధం కారణంగా సహాయ శిబిరాలకు ఎందరో సిరియన్లు వచ్చారు. వాయవ్య సిరియాలోని తిరుగుబాటుదారుల ఆక్రమిత భాగంలోని ఫర్జల్లా శిబిరంలో ఈ చిన్నారి తన తండ్రితో కలిసి నివసించింది. శిబిరం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను తండ్రే అలా గొలుసులతో కట్టేసినట్లు క్యాంప్ సూపర్వైజర్ హిషామ్ అలీ ఉమర్ చెప్తున్నారు. పాపను అలా కట్టేసి ఉంచొద్దని చాలా సార్లు చెప్పినా పెడచెవిన పెట్టాడని ఉమర్ తెలిపారు.
గొలుసులతో బంధించిన నహ్లా ఫొటోలు బయటకు వచ్చినప్పుడు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్రం ద్వారానే సిరియాకు ఉత్తరాన ఉన్న శిబిరాల్లో నివసిస్తున్న లక్షలాది మంది శరణార్ధుల బాధలను ప్రపంచం చూసింది. ముఖ్యంగా పిల్లలకు ఈ శిబిరాల్లో చాలా రోజులపాటు ఆహారం అందుబాటులో ఉండటం లేదు, ఫలితంగా వారు పోషకాహార లోపానికి గురవుతున్నారు.
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..