విజయ్ సేతుపతి, జయరామ్ కథానాయకులుగా నటించిన మలయాళ చిత్రం ‘మార్కోని మతాయ్’ తెలుగులో ‘రేడియో మాధవ్’ పేరుతో అనువాదమవుతోంది. లక్ష్మీచెన్నకేశవ ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత డి.వి.కృష్ణస్వామి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 23న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. విడిపోయిన ప్రేమికుల్ని కలిపే ఉదాత్తుడైన వ్యక్తిగా విజయ్ సేతుపతి పాత్ర ఉంటుంది. లేటు వయసు ప్రేమభావనల్ని ఆవిష్కరిస్తూ అందంగా సాగుతుంది. తెలుగు వెర్షన్కు భాషాశ్రీ అద్భుతమైన మాటలు, పాటలు రాశారు. తెలుగు స్ట్రెయిట్ చిత్రాన్ని చూసిన భావన కలుగుతుంది’ అన్నారు. స్వచ్ఛమైన ప్రేమకు వయోభేదాలు లేవని తెలియజెప్పే కథాంశమిదని, విజయ్సేతుపతి, జయరామ్ పాత్రల్ని చక్కగా తీర్చిదిద్దారని భాషాశ్రీ తెలిపారు. ఆత్మీయరాజన్, పూర్ణ, నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సజన్ కలతిల్, సంగీతం: జయచంద్రన్, కథ, దర్శకత్వం: సనిల్ కలతిల్.
మరిన్ని వార్తలు చదవండి..