ఉస్మానియా యూనివర్సిటీ : ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, పోలీసులు అంటే భయపడే ప్రజలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్తో పోలీసులు ప్రజలకు దగ్గరయ్యారు. అంతేకాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో సమాజంలో పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నగర వ్యాప్తంగా ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు లో భాగంగా ఉద్యోగ మేళాను ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ మేళాకు దాదాపు నాలుగువేల మంది నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. వారికి ఉద్యో గ అవకాశాలు కల్పించేందుకు దాదాపు 35 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ మేళాను ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వెయ్యి మైళ్లు అయినా.. ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. ప్రతీ ఉద్యోగానికి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అవకాశం ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుందని.. వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగంలో చేరి, తమ ప్రస్థానాన్ని కొనసాగించాలన్నా రు. శాంతిభద్రతల విషయంలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచంలోని సురక్షిత నగరాల జాబితాలో మొదటి 15 స్థానాల్లో మన నగరం కూడా ఉందని పేర్కొన్నారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేస్తున్నామన్నారు. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో రోజూ కనీసం 50-70 మంది పౌ రులతో పోలీసులు మాట్లాడుతున్నారని చెప్పారు. దేశం లో పౌరుల ఇండ్లకు వెళ్లి మరీ ఫిర్యాదులు స్వీకరించే ఏకైక నగరం హైదరాబాద్ అని అన్నారు. కొన్ని తరాలు కష్టపడితే ఇప్పుడు అగ్రదేశాలకు ఏ మాత్రం తీసిపోకుండా మన దేశం రూపొందిందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాలు కూడా విస్తృతమయ్యాయని, సామర్థ్యం, అర్హత, నైపుణ్యం ఉంటే విజయం తప్పక సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. టీమ్ వర్క్తో జాతి పురోగతి సాధిస్తుందన్నారు.