హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో స్కూలుకు రావాలా? ఇంటివద్దే ఉండి చదువుకోవాలా? అనేది విద్యార్థుల ఇష్టానికే వదిలేయాలని స్కూళ్ల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. కచ్చితంగా స్కూలుకు రావాలని విద్యార్థులకు బలవంతపెట్టరాదని తెలిపింది. ఇంట్లోనే ఉండి చదుకొనేలా కూడా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదలచేసింది. విద్యార్థులు కొవిడ్బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పాఠశాలలో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించి, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనేలా, శానిటైజర్ వాడేలా ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని సూచించింది.
ఇవీ మార్గదర్శకాలు