న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారి నుంచి 25 రోజుల్లో ఏకంగా రూ 11.44 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 19 నుంచి మే 13 మధ్య ఈ మొత్తాన్ని ఉల్లంఘనుల నుంచి రాబట్టిన పోలీసులు కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన 4356 మందిని అరెస్ట్ చేశారు.
మాస్క్ లు ధరించని 51,000 మందికి ఫైన్ వేశారు. భౌతిక దూరం పాటించనందుకు 8000 మందికి పైగా ఫైన్ విధించారు. లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన బాంక్వెట్ హాళ్లు, రెస్టారెంట్లు, పబ్ లపై సైతం కేసులు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.