హైదరాబాద్ : కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం కార్యాలయాలపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే సచివాలయంలో పాస్లను రద్దు చేసి, సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. తాజాగా కీలకమైన కమిషనరేట్/డైరెక్టరేట్లలోనూ ఆంక్షలు విధించారు. సందర్శకులు అత్యధికంగా వచ్చేది కమిషనరేట్, డైరెక్టరేట్లకే. కాగా, ఇటీవలే నారాయణపేట జిల్లా కలెక్టర్ వ్యక్తిగత కార్యదర్శి కరోనాతో మృత్యువాతపడ్డారు. సందర్శకుల వల్లే ఆయన కరోనా కాటుకు గురయ్యారని అధికారులు భావిస్తున్నారు. దీంతో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించి విజ్ఞప్తుల స్వీకరణకు ఆన్లైన్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని రద్దు చేశారు.
ఇవికూడా చదవండి..