భువనగిరి టౌన్, మార్చి 23 : పీఆర్సీ పరిధిలోకి ఆశ వర్కర్లను చేర్చడాన్ని హర్షిస్తూ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం(టీఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధం) ఆధ్వ ర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పట్టణంలోని వినాయకచౌరస్తాలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోషలు మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలను గుర్తించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని , అందుకే 30శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతోపాటు పీఆర్సీ పరిధిలోకి ఆశ వర్కర్లను చేర్చడం జరిగిందన్నారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి చిరంజీవియాదవ్, గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం జిల్లా కమిటీ మెంబ ర్స్ వెంకటమ్మ, అనిత, కృష్ణలీల, సుగుణ, భవాని, అనిత, వాణి, మమత, గీత, పద్మశ్రీ, మమత, సరిత పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్, ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంపును హర్షిస్తూ మంగళవారం మోత్కూరు మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ప్రకాశ్రాయుడు అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు కల్యాణ్చక్రవర్తి, వెంకన్న, కుమా ర్, పీహెచ్సీ వైద్యధికారి డాక్టర్ చైతన్యకుమార్, విశ్రాంత ఉద్యోగులు ఆనందం, సత్యనారాయణ, స్వామిరాయుడు, సత్తిరెడ్డి, లక్ష్మారెడ్డి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రామన్నపేటలో..
రామన్నపేట, మార్చి 23: సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ప్రకటించడాన్ని హ ర్షిస్తూ మంగళవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వైద్యులు, సిబ్బంది క్షీరాభిషేకం చేశా రు. కార్యక్రమంలో వైద్యులు వెంకటేశ్వర్లు, సిబ్బంది సువ ర్ణ, పద్మ, స్వప్న, సతీష్, లతీఫ్, వెంకటేశ్, రామలింగం, నిర్మల, పాండు, నగేశ్, ఉదయ్ పాల్గొన్నారు.